ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. తాజా మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో రీ నామినేష‌న్ల‌కు అవ‌కాశం ఇస్తూ ఆయ‌న జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను హైకోర్టు బుధ‌వారం కొట్టి వేసింది. కొత్త‌గా మునిసిప‌ల్ నామినేష‌న్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్ద‌ని కూడా కోర్టు సూచించింది. ఇక వ‌లంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవద్దని సూచించింది.  తిరుపతి కార్పోరేషన్‌లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్‌కు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వులు చెల్ల‌వ‌ని హైకోర్టు స్వ‌యంగా తీర్పు ఇవ్వ‌డంతో నిమ్మ‌గ‌డ్డ‌కు పెద్ద షాకే త‌గిలిన‌ట్ల‌య్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: