ఏపీలో అధికార వైసీపీలో కొత్త కోలాహాలం మొద‌లైంది.  ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోటాకు చెందిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు గురువారమే ఆఖరు రోజు.సి.రామచంద్రయ్య, మహమ్మద్‌ ఇక్బాల్‌, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్‌, చల్లా భగీరథ రెడ్డి, కళ్యాణ్‌ చక్రవర్తి నామినేష‌న్ పత్రాలు వేయనున్నారు. వీరిలో రామ‌చంద్ర‌య్య మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రిగా ప‌నిచేశారు. ఇక్బాల్ తాజా ఎమ్మెల్సీ, హిందూపురం వైసీపీ ఇన్‌చార్జ్‌.

ఇక దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వైసీపీ ఇన్‌చార్జ్‌, కళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి దివంగ‌త మాజీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ త‌న‌యుడు... చ‌ల్లా భ‌గీర‌థ‌.. దివంగ‌త చ‌ల్లా రామ‌కృష్ణా రెడ్డి త‌న‌యుడు. ఇక క‌రీమున్సీసా విజ‌య‌వాడ మాజీ కార్పొరేట‌ర్‌. ఈ ఆరుగురు ఊహించకుండానే ఎమ్మెల్సీలు అవ్వ‌డంతో వీరిలో మంచి జోష్ నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: