తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటులో వైఎస్‌ షర్మిల స్పీడ్‌ పెంచారు. వివిధ జిల్లాల వైఎస్‌ అభిమానులతో భేటీ అవుతున్న షర్మిల కొత్త పార్టీ విధి విధానాలపై చర్చిస్తున్నారు. ఈ నెల 9న పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు షర్మిల టీం లీక్‌లిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను ఆకర్షిస్తున్నారు షర్మిల. 

ఇప్పటికే వివిధ పార్టీల్లోని పలువురు నేతలు షర్మిలతో భేటీ అయి తమ మద్దతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాక కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఏడు ఏళ్ళుగా కాంగ్రెసులో నాకు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: