పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయంగా ఈ ఎన్నికల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ ని ఎలా అయినా సరే ఓడించాలి అనే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తృణమూల్‌ కు అండగా ఉంటామని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఒక ప్రకటన చేసారు. మమత పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహిస్తామనిఆయన స్పష్టం చేసారు.

సీఎం యోగి బెంగాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు చేసారు. ప్రజలను తీవ్ర గందరగోళంలో పడేసి, అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందులో బీజేపీ సఫలం కాకుండా తాము అడ్డుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఉచ్చులో ఎవరూ చిక్కుకోవద్దని ఆయన కోరారు. తమ సీనియర్ నేతలు ప్రచారంలో ఉంటారని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: