వైఎస్ షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. జగన్ పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి
వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసని, ఏం పీకాడని జగన్కు ఓటేస్తారు.. దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్కు రావాలంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. కర్నూలు నగరంలోలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చెన్నమ్మసర్కిల్ వద్ద
చైతన్య రథం నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రజలంతా గుర్తించి ఓటేయాలని కోరారు.