కొద్ది రోజులుగా టీడీపీలో ర‌చ్చ ర‌చ్చ‌కు కార‌ణ‌మ‌వుతోన్న విజయవాడ మేయర్ అభ్యర్థి విష‌యంలో క్లారిటీ వ‌చ్చేసింది. విజ‌య‌వాడ మేయ‌ర్ అభ్య‌ర్థిగా తెలుగుదేశం పార్టీ కేశినేని నాని కుమార్తె శ్వేతను ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలోని 11వ డివిజన్ నుంచి పోటీచేస్తున్న కేశినేని శ్వేత తమ మేయర్ అభ్యర్థి గా ఉంటార‌ని అచ్చెన్న స్వ‌యంగా జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. దీంతో విప‌క్ష టీడీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కొన్న గంద‌ర‌గోళానికి తెర‌దించిన‌ట్లు అవ్వ‌డంతో పాటు ఎంపీ కేశినేని నాని త‌న పంతం నెగ్గించుకున్నారు. తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ అధినాయకత్వానికి కేశినేని శ్వేత కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ అభివృద్ధికి తాను కృషి చేస్తానని కేశినేని శ్వేత తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: