ఆడ‌లేక మ‌ద్దెల‌ద‌ర్వు అన్న‌ట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు కీల‌క నేత‌ల ప‌రిస్థితి. వారు చేయ‌రు.. అక్క‌డ పార్టీ కోసం ఏదైనా చేసేవాళ్ల‌ను చేయ‌నివ్వ‌రు అన్న‌ట్టుగా వారి ప‌రిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌కు సొంత పార్టీలోనే ఎంతో మంది నేత‌లు క‌ళ్లెం వేస్తున్నారు. తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి పై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. రేవంత్ చేస్తోన్న పాద‌యాత్ర‌లో కావాల‌నే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్ల‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. పార్టీని బ‌ల‌హీనం చేసేందుకే రేవంత్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని మక్తల్, గద్వాల్ వంటి నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేయలేదని, దీనిపై రేవంత్ రెడ్డిని వివరణ కోరాలని సంపత్ కుమార్ తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: