విశాఖపట్నంలో చిన వాల్తేరు లో ఎన్నికల  ప్రచారంలో పాల్గొన్న  ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... ఏయూ లో పనిచేస్తున్న టైమ్ స్కెల్ ఉద్యోగులు సమస్యలు అన్ని వి.సి  దృష్టి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తాం అని విజయసాయి హామీ ఇచ్చారు. చిన వాల్తేరు లో తాగునీటి సమస్యతో సహా అన్ని సమస్యలు పరిష్కారిస్తాం అని స్పష్టం చేసారు.

ఎమ్మెల్యే  వెలగపూడి   రామకృష్ణ పెద్ద అవినీతి పరుడు అని అన్నారు. వంగవీటి హత్యలో నిందితుడు  వెలగపూడి అని, అలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు అని కోరారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికల్లో కుప్పం ప్రజలు కొట్టిన దెబ్బకు ఇంకా కోలుకోలేదు చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరు ఏవేవో మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. విశాఖ పరిపాలన రాజధానిగా మరింత అభివృద్ధి చేస్తాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: