కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం మరోసారి విషం కక్కింది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. 25  ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల కల  కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని ఆయన పేర్కొన్నారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు  రాష్ట్ర ప్రభుత్వనికి  లేఖ రాస్తే స్పందించలేదు అని ఆయన ఆరోపించారు.

ఇప్పుడు బీజేపీ కేంద్రం లో అధికారంలోకి వచ్చాక విభజనంచట్టంలో ఉన్న హామీలను తుంగలో తొక్కుతున్నారు అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తుందే కాంగ్రెస్ , బీజేపీ లు అని మండిపడ్డారు. ఐటిఐఆర్ , రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ల ఏర్పాటు లో కేంద్ర వైఖరిపై రాష్ట్ర బీజేపీ ఎంపిలు ఎం సమాధానం చెప్తారు అని అన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు మీ పార్లమెంట్ నియోజకవర్గలలో కేంద్రం నుండి ఎం తీసుకొచ్చారో బహిర్గతం చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: