గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ అభ్య‌ర్థిని తెలుగుదేశం పార్టీ ఖ‌రారు చేసింది. ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు మేయ‌ర్ అభ్య‌ర్థిగా పీలా శ్రీ‌నివాస్‌ను ప్ర‌క‌టించారు. జీవీఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబు శుక్ర‌వారం పెందుర్తి, గోపాల‌ప‌ట్నం ప్ర‌చార‌స‌భ‌ల్లో పాల్గొన్నారు. విశాఖ‌లో పీలా శ్రీ‌నివాస్‌ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని, తెలుగుదేశం పార్టీ విజ‌యాన్ని అడ్డుకోవ‌డం కూడా ఎవ‌రికీ సాధ్యంకాద‌న్నారు. ఉమ్మ‌డి ఏపీ సీఎంగా ఉన్న‌ప్పుడు విశాఖ‌ప‌ట్నాన్ని ఆర్థిక రాజ‌ధానిగా చేయ‌డాని ఎంతో శ్ర‌మించాన‌ని, ప్ర‌పంచ‌ప‌టంలో విశాఖ‌ను నిల‌బెట్ట‌డం త‌న‌కు గ‌ర్వంగా ఉంద‌న్నారు. విశాఖ‌ప‌ట్నం అంటేనే నీతి, నిజాయితీకి మారుపేర‌ని, హుద్‌హుద్ తుపాను వ‌చ్చిన‌ప్పుడు 10 రోజులు విశాఖ‌లోనే ఉండి సాధార‌ణ‌స్థితికి తెచ్చాన‌న్నారు. ఇక్క‌డ వైసీపీ గెలిస్తే రౌడీలు రాజ్య‌మేల‌తార‌ని, ఆ పార్టీని గెలిపిస్తే ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను ఒప్పుకున్న‌ట్లే అవుతుంద‌న్నారు. పీలా శ్రీ‌నివాస్‌ను గెలిపిస్తే విశాఖ‌ప‌ట్నానికి పూర్వ‌వైభ‌వం తెస్తామ‌ని చంద్ర‌బాబునాయుడు హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: