ఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేషన్ చైర్మ‌న్‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు అరుదైన గౌరవం దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వం నియమించింది. విష్ణు ఇప్ప‌టికే అటు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యేగా ఉండ‌డంతో పాటు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నారు. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడంతో ఆయన వర్గం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక ఆయ‌న‌కు ప్రస్తుతం విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు అగ్నిప‌రీక్ష‌గా మారాయి. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం సెంట్ర‌ల్లో పార్టీ త‌ర‌పున ఎక్కువ కార్పొరేట‌ర్ స్థానాలు గెలిపించాల్సిన బాధ్య‌త ఆయ‌న‌పై ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: