వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీపై ఎప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన్ను కూడా
టీడీపీ నాయకులు టార్గెట్ చేస్తూనే ఉంటారు. తాజాగా విజయసాయిపై
టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బ్రహ్మం తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. చంద్రబాబును విమర్శించే స్ధాయి,
లోకేష్ పేరెత్తే
అర్హత ఏ2 విజయసాయిరెడ్డికి లేదని ఆయన విమర్శించారు. ఇక భారతంలో శకుని మామ మాదిరిగా విజయసాయి ఏపీలో అధికారం వెలగబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. భారతంలో శకుని మామ కుట్రలకు పాండవులు కష్టాలపాలైనట్లు విజయసాయిరెడ్డి కుట్రలకు
విశాఖ ప్రజలు బలవుతున్నారన్నారు. ఇప్పుడు విజయసాయికి పెట్టిన శకుని పేరు సోషల్ మీడియాలో
టీడీపీ వాళ్లు వైరల్ చేస్తున్నారు.