ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు మరో తల నొప్పి వచ్చి పడింది. జగన్ ముఖ్య అనుచరుల ఆర్ధిక అక్రమాలు అంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్రానికి విదేశీ సంస్థలు ఫిర్యాదులు చేశాయని సదరు మీడియా కథనాలు ప్రసారం చేసింది. జగన్ అనుచరులు ఆర్ధిక అక్రమాలకు పాల్పడ్డారని కేంద్రానికి విదేశీ సంస్థలు ఫిర్యాదు చేసాయి.  విదేశీ సంస్థల ఫిర్యాదుపై కేంద్రం కూడా స్పందించింది.

జగన్ అనుచరుల ఆర్థిక అక్రమాలపై కేంద్ర సంస్థల దర్యాప్తు మొదలు అయినట్టు వార్తలు వస్తున్నాయి.  అంతర్గత దర్యాప్తును ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం మీడియా వర్గాలకు అందింది. విదేశీ సంస్థలు పెట్టుబడులను ఏపీలో పెట్టేందుకు జగన్ అనుచరులు అడ్వాన్స్ లు కూడా తీసుకున్నారని సమాచారం అందింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయినట్టుగా తెలిసింది. ఇక తాజాగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళడానికి ఇదే కారణం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: