దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణలో కూడా కొన్ని వారాలుగా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా కేసుల విజృంభ‌ణ మాత్రం ఆగ‌డం లేదు. తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే తాము మ‌రోసారి లాక్‌డౌన్ విధించ‌మ‌ని చెప్పేసింది. అయితే కొన్ని జాగ్ర‌త్త‌ల్లో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల అన్ని రాష్ట్రాల సీఎంల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో స‌మావేశ‌మైన మోడీ రాత్రిపూట క‌ర్ఫ్యూ విధించాల‌ని సూచించారు.

ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఇప్పడు తెలంగాణ కూడా అదే నిబంధ‌న అమ‌లు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: