తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతోన్న వైఎస్‌. ష‌ర్మిల రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆమె ఆరోగ్యం క్ర‌మ‌క్ర‌మంగా క్షీణిస్తోంది. లోట‌స్ పాండ్‌లో దీక్ష చేస్తోన్న ఆమెను వైద్యులు ప‌రీక్షించారు. ష‌ర్మిల షుగర్‌ లెవల్స్‌ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు వైద్యులు చెపుతున్నారు. గురువారం ఇందిరా పార్కు ధ‌ర్నా చౌక్ వ‌ద్ద దీక్ష చేప‌ట్టిన ఆమె దీక్ష‌ను సాయంత్రానికే పోలీసులు భ‌గ్నం చేశారు.

దీక్ష‌కు ఒక్క రోజు మాత్ర‌మే అనుమ‌తి ఉంది. అయినా ఆమె లోట‌స్ పాండ్‌లో దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. కేవ‌లం మంచినీరు మాత్రమే తాగుతూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. మీ కోసం తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేస్తా. ప్రభుత్వ రంగంలోనే కాదు.. ప్రైవేట్‌రంగం లో కూడా 11 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎదే అని ఆమె చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: