భారతీయ జనతాపార్టీ నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్యం క్షీణిస్తోంది. కరోనాతో సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చేరగా నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షిస్తున్నారు. పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు. మొదటిదశలో సోకనప్పటికీ రెండోదశలో కాస్తంత నిర్లక్ష్యంగా ఉండటం, ప్రభుత్వం తరఫున కూడా ఎటువంటి నిబంధనలు అమలు కాకపోతుండటంతో వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ నేతలకు కరోనా పాజిటివ్గా నిర్థారణైంది. టీకాలు అందుబాటులో లేకపోవడం ఒక కారణంకాగా, ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా లాక్డౌన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవడంలేదు. ప్రజలే ఎవరికివారు స్వచ్ఛందంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. రెండు రోజుల క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు రెండోసారి కరోనా సోకింది. ఆయన కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
భారతీయ జనతాపార్టీ నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్యం క్షీణిస్తోంది. కరోనాతో సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చేరగా నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షిస్తున్నారు. పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు. మొదటిదశలో సోకనప్పటికీ రెండోదశలో కాస్తంత నిర్లక్ష్యంగా ఉండటం, ప్రభుత్వం తరఫున కూడా ఎటువంటి నిబంధనలు అమలు కాకపోతుండటంతో వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ నేతలకు కరోనా పాజిటివ్గా నిర్థారణైంది. టీకాలు అందుబాటులో లేకపోవడం ఒక కారణంకాగా, ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా లాక్డౌన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవడంలేదు. ప్రజలే ఎవరికివారు స్వచ్ఛందంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. రెండు రోజుల క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు రెండోసారి కరోనా సోకింది. ఆయన కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.