ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. 80 సంవ‌త్స‌రాల వృద్ధురాలిపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా కొల్లూరు మండ‌లం కిష్కింధ‌పాలెం గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కిష్కింధ‌పాలేనికి చెందిన సీత‌మ్మ అనే వృద్ధురాలు 15 సంవ‌త్స‌రాల క్రితం రోజువారి ప‌నుల కోసం ఇక్క‌డికి వ‌చ్చి స్థిర నివాసం ఏర్ప‌రుచుకుంది. ఏడాది క్రితం ఆమె భర్త మృతి చెందగా.. కొడుకు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సీత‌మ్మ ఒంట‌రిగా ఉంద‌ని గ‌మ‌నించిన ఓ దుండ‌గుడు అర్థ‌రాత్రి ఆమె ఇంటి త‌లుపు త‌ట్టాడు. కొడుకు వ‌చ్చాడ‌నుకొని త‌లుపుతీసిన ఆ అమాయ‌కురాలిపై నిందితుడు లైంగికదాడిచేసి పారిపోయాడు. సీతమ్మ ఈ విష‌యాన్ని స్థానికులకు తెలియ‌జేయ‌డంతో వారు ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: