తెలంగాణలో వరుస ఎన్నికల జాతర జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అక్కడ రెండు కార్పోరేషన్లతో పాటు ఐదు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషన్ కోర్టులో దాఖలు అయ్యింది. కరోనా తీవ్రత ఎక్కవగా ఉన్నందున ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ పిటీషన్ వేశారు.
ఖమ్మం,
వరంగల్ కార్పొరేషన్లతో పాటు తెలంగాణలోని మరికొన్ని మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికలు వాయిదా వేయాలని షబ్బీర్ వేసిన పిటిషన్ను విచారించిన కోర్టు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున దీనిని వాయిదా వేయలేమని చెప్పింది. తదుపరి విచారణను
జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది.