తెలంగాణ‌లో వ‌రుస ఎన్నిక‌ల జాత‌ర జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అక్క‌డ రెండు కార్పోరేష‌న్ల‌తో పాటు ఐదు మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిష‌న్ కోర్టులో దాఖ‌లు అయ్యింది. క‌రోనా తీవ్రత ఎక్కవగా ఉన్నందున ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ పిటీషన్ వేశారు. 

ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు తెలంగాణలోని మరికొన్ని మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నిక‌లు వాయిదా వేయాల‌ని ష‌బ్బీర్ వేసిన పిటిష‌న్‌ను విచారించిన కోర్టు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున దీనిని వాయిదా వేయలేమని చెప్పింది. తదుపరి విచారణను జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: