ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అత్యంత ఆప్తుడిగా పేరున్న ‌అడిషనల్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్ర‌భుత్వం మ‌రోసారి షాక్ ఇచ్చింది. ర‌క్ష‌ణ ప‌రిక‌రాల కొనుగోళ్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప‌టికే ఏబీపై లీవ్‌ పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అంతకు ముందే ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్‌కు ధరఖాస్తు చేశారు. ఏబీవీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. కేసు దర్యాప్తులో హైకోర్టులు జోక్యం చేసుకోవద్దని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందంటూ… ఏబీవీ కేసులో తమ వాదనలు వినిపించాలని ప్రభుత్వం మళ్లీ పిటీషన్‌ వేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: