క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. దీంతో..కొవిడ్‌ మహమ్మారిపై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది డాక్టర్లు వైరస్‌ బారిన పడుతున్నారు . తాజాగా బిహార్‌లో 500 మందికి పైగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. కరోనా రెండో దశలో రాష్ట్రంలోని ఎయిమ్స్‌, పట్నా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఇప్పటివరకు 500 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రజల్లు ఇళ్ల లో నుండి బయటకి రావడానికే భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: