క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఏపిలో సైతం కరోనా స్పీడ్ గా వ్యాపిస్తుంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే.. పొదలకూరు పట్టణం చుట్టుపక్కల గ్రామాలలో గురువారం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయాలని ఎస్ఐ రహీంరెడ్డి పిలుపునిచ్చారు. కరోనా సెకెండ్ వేవ్ ను కట్టడి చేయాలంటే ..ప్రతి ఒక్క దుకాణాదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒంటిగంట తర్వాత దుకాణాలు మూసివేయాలని కోరారు. పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇటువంటి విధమైన నిర్ణయాలు తప్పవన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: