“కరోనా”.. మూడు అక్షరాల పదం ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతుంది. ప్రస్తుతం కరోనా మన దేశాన్ని ఎలా పట్టి పీడిస్తుందో మనకు తెలిసిందే.  ఒక్కరోజే దాదాపు 3లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి అంటే దీని ప్రభావం ఎంతలా ఉందో మనం ఉహించుకోవచ్చు.

అయితే ఈ కరోనా కి వ్యాక్సిన్ వచ్చినా.. దురదృష్టవశాత్తూ దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజు కి పెరిగిపోతుంది. ప్రస్తుతం మనం ఉన్న పరిస్ధితుల్లో చికిత్స కన్నా నివారణే మేలు. ఈ మాట అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటమే ఇప్పుడు అందరికీ అవసరం. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం.  అయితే.. కొత్తగా పచ్చి ఉల్లిపాయను కల్లు ఉప్పు ద్వారా తింటే.. కోవిడ్ మహమ్మారి కేవలం 15 నిమిషాల్లో నయమవుతుందనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.అయితే .. కల్లు ఉప్పు, ఉల్లిపాయ తింటే కరోనా తగ్గిపోతుందన్న వార్తను ఢిల్లీలోని డాక్టర్లు ఖండించారు. ఇదంతా పుకార్లేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వర్ల్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: