దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులు, సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు.  అంతేకాదు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. మరికొందరు కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. అయితే తాజాగా సూపర్‌ స్టార్‌  మహేష్‌ బాబు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో కి వెళ్లినట్లు తెలుస్తుంది. తన పర్సనల్‌ స్టైలిస్ట్‌ కరోనా బారిన పడటంతో అతనితో పాటు మరి కొందరిలోనూ కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో.. ముందు జాగ్రత్తగా మహేష్‌ బాబు క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆందోళన వ్యస్త్మ్ చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి కరోనా రాకూదు అని దేవుడికి ప్రార్ధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: