దేశంలో స‌గ‌టున రోజుకు 2.5 లక్ష‌ల కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌త నెల రోజులుగా కోవిడ్ వ్యాప్తికి బ్రేకులు లేవు. వరుసగా 17 రోజు దేశంలో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు భారీగా నమోదుకావడంతో ఆరోగ్య వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య రంగ నిపుణులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక వరుసగా నాలుగో రోజు దేశంలో కోవిడ్ మరణాలు 2వేలకుపైగా నమోదుకావడం గమనార్హం. పది రోజుల నుంచి రోజుకి 1000కిపైగా మరణాలు సంభవిస్తున్నాయి. కేవలం పది రోజుల్లోనే 15 వేల మంది కోవిడ్ మహమ్మారికి బలయ్యారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: