హైద‌రాబాద్‌లో జ‌రిగిన దిశ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా ఎంత‌మందిని తీవ్రంగా క‌లిచివేసిందో చూశాం. ఇప్పుడు అలాంటి త‌ర‌హా ఘ‌ట‌నే ఏపీలోనూ రిపీట్ అయ్యింది. క‌ర్నూలు జిల్లాలో గుర్తు తెలియ‌ని దండుగులు కొంద‌రు 16 ఏళ్ళ బాలికపై దారుణంగా అత్యాచారం చేశారు. అక్కడితో ఆగకుండా.. ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంట్టించారు దుండగులు. జిల్లాలోని గాలేరు-నగరి కాలువ సిమెంట్ కాంక్రీట్ పనులకు తల్లి దండ్రులతో బాలిక వచ్చింది.

అక్క‌డే ఉన్న కొంద‌రు కామాంధులు ఆ బాలిక‌పై క‌న్నేశారు. ఆమెకు మాయ‌మాట‌లు చెప్పి ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. జిల్లాలోని బనగాన‌పల్లె మండలం యాగంటిపల్లిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మృతురాలు తెలంగాణలోని నారాయణపేట జిల్లా మర్రికెల్ల మండలానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. ఇక ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: