తెలంగాణలో కరోనాకు బ్రేక్ పడడం లేదు. కరోనా ఉధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6206 కేసులు నమోదు అయ్యాయి. కొద్ది రోజులుగా చూస్తుంటే ప్రతి రోజు కేసుల సంఖ్య వేలల్లోనే ఉంటోంది. తాజాగా 6 వేలకు పైగా కేసులు అంటే మామూలు విషయం కాదు. ఇది కరోనా జోరుకు అద్దం పడుతోంది. ఇక నిన్న ఏకంగా కరోనాతో 29 వేల మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి 3 వేల మంది కోలుకున్నారు. ఇక రాజధాని నగరం అయిన గ్రేటర్ హైదరాబాద్లో కేసులు విపరీతంగా పెరిగి పోతుండడంతో కంటోన్మెంట్ జోన్లను కూడా పెంచుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: