హైకోర్టులో మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటుపై పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 19ని రద్దు చేయాలని పిటీషన్లు వేశారు. రాజ‌ధాని ప్రాంతంలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న రెండు మున్సిపాల్టీలు అయిన మంగళగిరి, తాడేపల్లిని క‌లిపేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని పిటీషన్ దాఖలయింది. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పిటీషనర్ తరుపున న్యాయవాది వాదించారు. ఈ పిటీషన్ పై సెలవుల తర్వాత విచారణ చేపడతామని, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: