ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న ప్రదీప్ వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రదీప్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ, జీ తెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోలకు ప్రదీప్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. డ్రామా జూనియర్స్ సీజన్ 5లో ఎస్వీ కృష్ణారెడ్డి, రేణు దేశాయ్, సునీత జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రొగ్రామ్ ప్రోమోలో ప్రదీప్ స్థానంలో రవి యాంకరింగ్ చేస్తూ కనిపించారు. ప్రదీప్కి కరోనా రావడంతో అతని స్థానంలో రవిని యాంకర్గా పెట్టారనే వార్తలు సోషల్మీడియాలో వస్తున్నాయి. మూడు నెలలుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈసారి పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరికీ కరోనా సోకుతోంది. తాజాగా వెండితెర నుంచి బుల్లితెరకు వైరస్ వ్యాపించింది.
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న ప్రదీప్ వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రదీప్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ, జీ తెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోలకు ప్రదీప్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. డ్రామా జూనియర్స్ సీజన్ 5లో ఎస్వీ కృష్ణారెడ్డి, రేణు దేశాయ్, సునీత జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రొగ్రామ్ ప్రోమోలో ప్రదీప్ స్థానంలో రవి యాంకరింగ్ చేస్తూ కనిపించారు. ప్రదీప్కి కరోనా రావడంతో అతని స్థానంలో రవిని యాంకర్గా పెట్టారనే వార్తలు సోషల్మీడియాలో వస్తున్నాయి. మూడు నెలలుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈసారి పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరికీ కరోనా సోకుతోంది. తాజాగా వెండితెర నుంచి బుల్లితెరకు వైరస్ వ్యాపించింది.