నెస్లే కంపెనీ ఉత్పత్తి చేస్తోన్న కిట్కాట్ చాక్లెట్ రేపర్పై తప్పుడు సమాచారం ముద్రించారు. ఈ విషయాన్ని మణిపూర్ అటవీ శాఖాధికారి గుర్తించారు. వాస్తవాన్ని తెలుసుకొని తప్పును సరిచేయాలంటూ ఆ సంస్థకు లేఖ రాశారు. కిట్కాట్ చాక్లెట్ రేపర్పై కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్ మేఘాలయలో ఉన్నట్లుగా కంపెనీ వెల్లడించింది. దానిపై రెడ్ పాండా ఫొటో కూడా ముద్రించారు. అయితే ఈ రెండు తప్పని మణిపూర్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్లైఫ్) డాక్టర్ ఏకే జోషి తెలిపారు. ఆ జాతీయ పార్క్ మణిపూర్లోని మొయిరాంగ్ వద్ద ఉందని, అక్కడ రెడ్ పాండాలు ఉండవన్నారు. ఈ తప్పును సరిదిద్దాలంటూ నెస్లే సీఎండీ సురేశ్ నారాయణన్కు లేఖ పంపించారు. ఇది ఆ సంస్థ బాధ్యతారహితమైన చర్యగా ఏకే జోషి అభివర్ణించారు. వాస్తవాలను ధ్రువీకరించకుండా రేపర్పై తప్పుడు సమాచారం ముద్రించడం సరికాదని, తప్పును సరిచేయాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
నెస్లే కంపెనీ ఉత్పత్తి చేస్తోన్న కిట్కాట్ చాక్లెట్ రేపర్పై తప్పుడు సమాచారం ముద్రించారు. ఈ విషయాన్ని మణిపూర్ అటవీ శాఖాధికారి గుర్తించారు. వాస్తవాన్ని తెలుసుకొని తప్పును సరిచేయాలంటూ ఆ సంస్థకు లేఖ రాశారు. కిట్కాట్ చాక్లెట్ రేపర్పై కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్ మేఘాలయలో ఉన్నట్లుగా కంపెనీ వెల్లడించింది. దానిపై రెడ్ పాండా ఫొటో కూడా ముద్రించారు. అయితే ఈ రెండు తప్పని మణిపూర్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్లైఫ్) డాక్టర్ ఏకే జోషి తెలిపారు. ఆ జాతీయ పార్క్ మణిపూర్లోని మొయిరాంగ్ వద్ద ఉందని, అక్కడ రెడ్ పాండాలు ఉండవన్నారు. ఈ తప్పును సరిదిద్దాలంటూ నెస్లే సీఎండీ సురేశ్ నారాయణన్కు లేఖ పంపించారు. ఇది ఆ సంస్థ బాధ్యతారహితమైన చర్యగా ఏకే జోషి అభివర్ణించారు. వాస్తవాలను ధ్రువీకరించకుండా రేపర్పై తప్పుడు సమాచారం ముద్రించడం సరికాదని, తప్పును సరిచేయాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.