తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ ని అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్టుగా గైడ్‌లైన్స్ ని కూడా విడుదల చేసింది ప్రభుత్వం. తాజాగా ఆ కర్ఫ్యూ ని పొడిగిస్తూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం కొత్త గైడ్‌లైన్స్ ని కూడా జారీ చేసింది. కర్ఫ్యూ లో భాగంగా నైట్ కర్ఫ్యూను ఈ నెల 15 వరకు కొనసాగించబోతున్నట్టు ప్రకటించింది. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేయాలనీ, మాస్క్ విధిగా ధరించాలని. ఫంక్షన్స్ కి 100 మందికి మించి ఉండరాదని నిబంధన పెట్టారు. అంత్యక్రియలలో సైతం కేవలం 20 మందికి అనుమతినిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: