దేశంలో కరోనా వైరస్  రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో కరోనా రక్కసి మరణమృదంగం కొనసాగుతోంది. నిత్యం లక్షల మందిపై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. తాజాగా ఒక్కరోజే 4వేలకుపైగా ప్రాణాలను బలి తీసుకుంది. ఇక తెలంగాణలోను కరోనా విలయతాండవం చేస్తుంది. గత కొద్ది రోజులుగా జనగాం జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. మహమ్మరికి గురైన బాధితులతో జిల్లా ఆసుపత్రి నిండిపోయింది. జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో పలు గ్రామాల్లో ఇప్పటికే స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకున్నారు. కాగా..జనగాం జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న నెల్లుట్లలో 100కి పైగా యాక్టివ్ కేసులు నమోదు కావడం జిల్లాను హడలెత్తిస్తుంది. గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో సెల్ఫ్ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: