తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 4,976 పాజిటివ్‌ కేసులు.. 35 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 55,358 నమూనాలను పరీక్షించగా 4976 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,97,361కి చేరింది. కరోనా మహమ్మారితో తాజాగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 2,739కి పెరిగింది. కరోనా నుంచి 4,28,865 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 65,757 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో 7,646 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 851 కేసులు, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 384, మహబూబ్‌నగర్‌లో 208 కేసులు నమోదైనట్లు పేర్కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: