ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ అయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో మంగళవారం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో ముగ్గురు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో మంగళవారం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా గ్యాస్‌ లీకేజీ కావడంతో పరిశ్రమ లోపల ఉన్న ముగ్గురు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గ్యాస్‌కు లీకేజీకి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: