కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుుంచి (12వ తేదీ) పది రోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు వెల్లడించింది. రేపటి నుంచి తెలంగాణ లాక్డౌన్ విధిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కాసేపటి క్రితం క్యాబినెట్ లో కేసీఆర్ నిర్ణయం వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ లో మినహాయింపు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు మరికాసేప‌ట్లో విడుద‌ల కానున్నాయి. ప్ర‌తి రోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. మిగ‌తా 20 గంట‌లు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌నుంది. త్య‌వ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువుల కొనుగోలుకు ఈ స‌మ‌యంలో వెసులుబాటు క‌ల్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: