తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 75,289 పరీక్షలను నిర్వహించగా.. 4,801 పాజిటివ్‌ కేసులు, 32 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటివరకు 2,803 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,06,988కి చేరింది. కరోనా నుంచి 4,44,049 మంది కోలుకుని డిశ్చార్జి. తెలంగాణలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఈనెల 20న కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: