దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. నిన్న కాస్త తగ్గినట్లే తగ్గిన పాజిటివ్ కేసులు మరోసారి ఎగబాకాయి. కరోనా యాక్టివ్ కేసుల్లో తగ్గుదల కనిపించగా, మరణాల సంఖ్య మాత్రం నాలుగు వేల పైచిలుకు దాటాయి. దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3,48,371 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు కూడా మరో నాలుగు వేలు తగ్గడంతో 3.71 లక్షలకు పడిపోయాయి. ఇక నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు మరో 4205 మంది బాధితులు మృతిచెందారు. ఒకేరోజు ఇంత భారీసంఖ్యలో కరోనా బాధితులు మరణించడం ఇదే మొదటిసారి. దీంతో గత 14 రోజుల్లో 50 వేల మంది కరోనాతో కన్నుమూశారు. తాజా మరణాలతో మొత్తం మృతులు 2.5 లక్షలు దాటారు.
మరింత సమాచారం తెలుసుకోండి: