అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి బూతులు తిడుతూ సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అండ చూసుకుని రఘురామ కృష్ణం రాజు రెచ్చిపోతున్నారని.. వైసీపీ గుర్తుపై గెలిచి డ్రామాలేంటి.. కరోనా కాలంలో ఒక ఎంపీగా ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నావా? సెంట్రల్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నావా? అదీ లేదు.. ఎప్పుడు చూసిన జగన్పై పడి ఏడుస్తున్నావు. అంటూ మండిపడింది. వైసీపీ జోలికి వచ్చినా.. జగన్ని అన్నా తానే కౌంటర్ ఇస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది.
అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలపై రఘురామ కృష్ణంరాజు కూడా కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చారు. కొందరు లఫుట్గాళ్లు తెర వెనుక ఉండి ఓ కుల దేవత, శృంగార దేవతను ఎన్నుకున్నారని శ్రీరెడ్డి ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు. కొందరు దొంగ రెడ్లు తెర వెనుక ఉండి ఆమెతో తనను తిట్టిస్తూ వీడియోలు చేయిస్తున్నారని.. 10 శాతం పనికిరాని రెడ్ల కుల దేవత.. ప్రతీవ్రత అంటూ శ్రీరెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో తనను తిట్టే అవకాశాలు రావాలని.. వాటికి మంచి రెమ్యునరేషన్ రావాలని కోరుకుంటున్నానంటూ రఘురామ కృష్ణంరాజు శ్రీరెడ్డికి ఘాటుగా జవాబు ఇచ్చారు.