బంగ్లాదేశ్ జట్టు పేసర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ముస్తఫిజుర్ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముస్తఫిజుర్ రెహ్మాన్ కొన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు. వరుసగా బయోబబుల్‌లో ఉండటం వల్ల చిరాకు పుడుతుందని.. తాను మానసికంగా, శారీరికంగా అలసి పోయానని చెప్పాడు. కొన్నాళ్లు క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చి కుటుంబంతో గడపాలని భావిస్తున్నట్లు ముస్తఫిజుర్ అంటున్నాడు. ఇటీవల ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ముస్తఫిజుర్, తర్వాత బంగ్లాదేశ్ కోసం అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి బయోబబుల్‌లో ఉంటున్నాడు. అంతకు ముందు న్యూజీలాండ్ పర్యటనలో కూడా బయోబబుల్‌లో ఉండి నేరుగా ఇండియాకు వచ్చాడు. ఇలా వరుసగా బబుల్‌లో ఉండి చిరాకు వేస్తున్నదని.. అందుకే కొన్నాళ్లు క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చి కుటుంబంతోగడపాలని అనుకుంటున్నట్లు ముస్తఫిజుర్ వెల్లడించాడు. ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత రాజస్థాన్ యాజమాన్యం మమ్మల్ని క్షేమంగా బంగ్లాదేశ్ పంపినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: