కరోనా వైరస్ రెండో దశలో ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకూ ప్రతీ ఒక్కరిని ఈ మహమ్మారి భయాందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈసారి వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా సోకి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కొందరు వైరస్ నుంచి కోలుకున్నారు. మరి కొందరు ఈ కరోనా మహమ్మారికి బలైయ్యారు. అయితే తాజాగా దర్శకుడు, దాసరి శిష్యుడు అక్కినేని వినయ్ కుమార్ కరోనాతో మృతి చెందారు.
 'ఏడంస్తుల మేడ' నుంచి దాసరి వద్ద శిష్యరికం చేసిన వినయ్ కుమార్ 'పవిత్ర' సినిమాకు దర్శకత్వం వహించారు.  ఇక సూపర్ హిట్ టీవీ సీరియల్ 'అంతరంగాలు'తో పాటు అక్కినేని వినయ్ కుమార్ 'నా మొగుడు నాకే సొంతం, అమ్మ, ఆరాధన' వంటి పలు సీరియల్స్ కి దర్శకత్వం వహించారు. అక్కినేని వినయ్ కుమార్ మృత దేహానికి ఈ రోజు ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: