తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. తెలంగాణ కరోనా బులెటిన్ విడుదలైంది. రాష్ట్రంలో కొత్తగా 4,723 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెలువరించింది. కాగా,  వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెలువరించిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం మొత్తం కేసులు 5,11,711కు చేరాయి. . తాజాగా కరోనాతో బాధపడుతూ మరో 31 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,834కు చేరింది. ఇప్పటివరకు 4,49,744 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 745 కరోనా కేసులు నమోదయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: