దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేస్తూ కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ఐ సి ఏం ఆర్ పలు కీలక సూచనలు చేసింది. దేశంలో మరో ఆరు నుండి ఎనిమిది వారాలు లాక్ డౌన్ విధించినప్పలుడే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని ఐ సి ఏం ఆర్ స్పష్టం చేసింది. కరోనా తీవ్రత 10 శాతం కంటే అధికంగా ఉన్న జిల్లాల్లో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని ఐ సి ఏం ఆర్ సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: