ప్రముఖ దర్శకుడు, అక్కినేని వినయ్ కుమార్ అనారోగ్యంతో మరణించారు. ఈయన పలు విజయవంతమైన సినిమాలకు, సిరియళ్ళకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా టీవి సిరియళ్లతో ఈ దర్శకుడికి మంచి పేరు వచ్చింది. సూపర్ హిట్ సీరియల్ " అంతరంగాలు " ఈయన డైరెక్షన్లో వచ్చినదే. " నా మొగుడు నాకే సొంతం ", అమ్మ , ఆరాధన, వంటి ఇతర సిరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. ఈయన దాసరి నారాయణ వద్ద శిష్యరికం వహించారు. గత కొంత కాలంగా ఈ దర్శకుడు అనారోగ్యంతో భాదపడుతూ ఉండగా కరోనా కూడా సోకడంతో  హైదరబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: