కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రం లాక్ డౌన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రభావం ఆర్టీసీ పైన తీవ్ర స్థాయిలో ఉంటుంది. నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటలకు మొదలయి 10 గంటల వరకు తిరిగి డిపోకు చేరుకోవాలి. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,700 వరకు సిటీ బస్సులు ఉండగా, బుధవారం రోజు 800 బస్సులు ఒక్క ట్రిప్ తో అన్ని రూట్లలో తిరిగాయి. ఇక అత్యవసర అవసరాల కోసం మరి కొన్ని బస్సులు కేటాయించే అవకాశం వుంది. వైద్య సేవలు అందించే వారికోసం, శానిటేషన్ వర్కర్లు మరియు జీహెచ్‌ఎంసీ వర్కర్ల కోసం మరి కొన్ని బస్సులు నడపాలని నిర్ణయించారు ఆర్టీసీ డిపార్ట్మెంట్.

మరింత సమాచారం తెలుసుకోండి: