ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పర్వదినం అయిన రంజాన్ ను ఈ నెల 14 న జరుపుకోవడానికి మత పెద్దలు మరియు రుహియతే హిలాల్‌ కమిటీ అధ్యక్షుడు అయిన మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుతారీ బుధవారం రోజు పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ బుధవారం రోజు భారత్ లో ఎక్కడ నెలవంక కనిపించలేదు అని తెలిపారు. ఈ క్రమంలో రంజాన్ మాసం చివరి రోజు అయిన గురువారం రోజు ఉపవాసం పాటించి శుక్రవారం రోజు పండగను జరుపుకోవాలని సూచించారు. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి లోపలే ప్రార్ధనలు చేసుకోవాల్సిందిగా పిలుపిచ్చారు మౌలానా ఖుబ్బుల్‌పాషా.


మరింత సమాచారం తెలుసుకోండి: