భారత్ లో కరోనా మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే వుంది. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన మరణాల్లో 44 శాతం ఇండియాలో సంభవించడం నిజంగా దురదృష్టకరం. ఇక బుధవారం రోజున కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం కేవలం గత 24 గంటల్లో 3, 48, 421 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4205 మంది మృత్యువాత పడ్డారు. ఇక మూడు లక్షలకు పైగానే కరోనా నుండి కోలుకున్నారు. కరోనా పాజిటివ్ ల సంఖ్య పెరిగినట్టుగానే రికవరీ అయ్యేవారి సంఖ్య ఉండటం విశేషం. భారత్ లో కరోనా తో ఇప్పటి వరకు రెండున్నర లక్షలకు పైగా పౌరులు కన్ను మూసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: