దేశంలో కరోనా మహమ్మరి తీవ్రంగా విజృంభిస్తుంది. రెండు రోజులు తగ్గిన కేసులు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,62,720 పాజిటివ్ కేసులు నమోదవగా, 4136 మంది మరణించారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళలో 40 వేల చొప్పున ఉండగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్లో 20 వేల చొప్పున ఉండగా, ఉత్తరప్రదేశ్లో 15 వేలు, రాజస్థాన్లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: