దేశంలో కరోనా మహమ్మరి తీవ్రంగా విజృంభిస్తుంది. రెండు రోజులు తగ్గిన కేసులు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,62,720 పాజిటివ్ కేసులు నమోదవగా, 4136 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. అనేక వేల మంది వైద్యం అందక, సరైన సమయానికి
ఆక్సిజన్ అందక బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో
గుజరాత్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో కూడా నిత్యం 10వేలకుపైగా కరోనా కేసులు నమోదువుతున్నాయి.
గుజరాత్ రాష్ట్రంలో నిన్న 11,017 కరోనా కేసులు నమోదు కాగా.. 102 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7 లక్షలు దాటగా.. ఇప్పటివరకూ 8,731 మంది మరణించారు.