మొదటగా ఈ బస్సులను రాజమండ్రిలో ట్రైయిల్ రన్ నిర్వహించనున్నారు.స్థానికి ఎంపీ మార్గాని భరత్ సూచనల మేరకు రాజమండ్రి ఆర్టీసీ గ్యారేజ్లో రెండు వెన్నెల బస్సులను వైద్య సేవలకు ఉపయోగపడేలా మారుస్తున్నారు.ఈ బస్సుల్లో ఇమిడే విధంగా ఉండే ఆక్సిజన్ సిలెండర్లను ప్రత్యేకంగా విశాఖపట్నం నుంచి తీసుకువచ్చారు.కోవిడ్ బాధితునకు సత్వరమే ఆక్సిజన్ అందజేసి ప్రాణాపాయ స్థితి నుంచి నుంచి ఆదుకునేందుకు ఎంతగానో ఈ ప్రాణవాయు రథచక్రాలు దోహదపడతాయి. కరోనా పాజిటివ్ వచ్చి ఆక్సిజన్ అందక ఇబ్బందిపడే వారికి అత్యవసరంగా ఈ బస్సుల్లో చికిత్స అందిస్తారు.ఈలోగా ఏ ఆసుపత్రిలో అయినా బెడ్ దొరకగానే వారిని ఆ ఆసుపత్రికి షిఫ్ట్ చేసి వైద్యసేవలు అందించనున్నారు. అయితే ఈ బస్సులకు "జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు"గా రూపకల్పన చేసినట్లు ఎంపీ మార్గాని భరత్ తెలిపారు.
మొట్టమొదటి సారిగా రాజమహేంద్రవరం నగరంలో కోవిడ్ బాధితులకు బస్సులో వైద్యం అందించే విధానం విజయవంతమైతే దీనిని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్ళతానని చెప్పారు. తన ఆలోచనల నుంచి ఉద్భవించిన ఈ కార్యక్రమం ద్వారా కోవిడ్ బాధితులకు న్యాయం జరిగితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదన్నారు.