దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్నది. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉన్నా.. కోలుకునే వారి సంఖ్య అదే స్థాయిలో ఉంది. గత 24 గంటల్లో 3,43,144 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. పాజిటివ్ కాస్త తగ్గినా మరో 4వేల మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజా లెక్కలతో కలిపి మొత్తం 2,40,46,809 కేసులు నమోదు కాగా అందులో 2,00,79,599 మంది కొవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడ్డారు. 2,62,317 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 37,04,893 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా 31,13,24,100 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: