దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్నది. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సినీ ప్రముఖులు, యువ కళాకారులు, రచయితలు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. ఇప్పటికే ఎంతో మందిని సినీ ప్రముఖులను బలితీసుకున్న ఈ మహమ్మారి కరోనా తాజాగా సినీ యువ రచయిత నంద్యాల రవి ని బలి తీసుకుంది. సినీ యువ రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూసారు.    కరోనావైరస్ కారణంగా ఏప్రిల్ చివరి వారంలో హాస్పిటల్ చేరిన నంద్యాల రవి.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు కరోనాతో తుదిశ్వాస విడిచారు.  నంద్యాల రవి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేసారు.   కాగా నంద్యాల రవి హాస్పిట్ లో ఉన్నప్పుడు కరోనా చికిత్స  బిల్లులు సుమారు రూ.6 లక్షలకు పైగా చేరుకోవడంతో, ఆ మొత్తాన్ని చెల్లించే స్థోమత కుటుంబ సభ్యులకు లేకపోవడంతో.. ఈ క్రమంలో ఆయనకు చేయూతగా నిలిచేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి అండగా నిలిచారు. ఇదిలా ఉండగా, నంద్యాల రవి  పవర్ ప్లే, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాలకు పనిచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: